చంద్రబాబు మరో ఎన్నికల హమీ అమలు - యువత కు కొత్తగా.!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశ గా కసరత్తు మొదలు పెట్టింది. తాము అధికారంలోకి వస్తే వర్క్ ఫ్రం హోం విధానం అందుబాటు లోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా కార్యాచరణ మొదలైంది. ఈ మేరకు సర్వే మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్లి ఈ విధానం అమలు పైన ఆరా తీస్తున్నారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ప్రభుత్వం కసరత్తు
ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం పైన సర్వే మొదలు పెట్టింది. ఇంటింటికి అధికారులు వెళ్లి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా అనే అంశం పైన ఆరా తీస్తోంది. ఈ రకంగా పని చేసుకోవటానికి ఉన్న సమస్యలు ఏంటని తెలుసు కొనే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారని వివరాలు సేకరిస్తోంది. ప్రతీ ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్లి వారి వివరాలు సేకరిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీ లోగా ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

సర్వే నివేదికలతో
సర్వేలో సేకరించిన ఆధారాల ను క్రోడీకరించి ప్రభుత్వం ఈ విధానం అమలు పైన కార్యాచరణ ఖరారు చేయనుంది. వివిధ సంస్థల కోసం ప్రస్తుతం ఇళ్ల నుంచి పని చేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, దాని స్పీడ్, విధి నిర్వహణకు గదుల కొరత తదితరాలను ఈ సర్వేలో గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఇందుకు అనుగుణంగా విద్యార్హత కలిగిన వారిని గుర్తిస్తున్నారు. వారి భవిష్యత్ ప్రణాళిక లు.. వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పిన గురించి వివరించనున్నారు.
ప్రత్యేక సెంటర్లు
అర్హత ఉన్న వారికి ఇంటి నుంచే పని చేయడానికి ఎలాంటి సదుపాయాలు కావాలి వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించేందుకు ప్రైవేట్ భవనాలు అందుబాటులో ఉన్నాయా అనే వివరా లనూ సేకరిస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువమంది వర్క్ ఫ్రంహోం చేసేందుకు సుముఖంగా ఉంటే అలాంటిచోట ఒక సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే పూర్తయ్యాక వివిధ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాలని భావిస్తోంది. ఈ మేరకు వారి ప్రాంతాల్లోనే పని చేసుకొనేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సర్వే పూర్తయిన తరువాత మొత్తం ప్రక్రియ పైన స్పష్టత రానుంది.
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!











Click it and Unblock the Notifications