సీబీఐకు స్కిల్ కేసు - హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టత..!!
చంద్రబాబు రిమాండ్ కు కారణమైన స్కిల్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి ఈ కేసును సీబీఐకు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సీబీఐ విచారణకు ఇవ్వటానికి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు స్పష్టం చేసారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసారు.
హైకోర్టులో కీలక పరిణామం : స్కిల్ స్కాం కేసులో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణలో ఉంది. ఈ సమయంలో హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ ఈ నెల 17న విచారణకు రానుంది.

ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసారు. స్కిల్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి కోరారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణ ప్రత్యేక విచారణ టీంను ఏర్పాటు చేసామని ఏజీ కోర్టుకు నివేదించారు.
అభ్యంతరం లేదన్న ప్రభుత్వం : ఈ కేసుకు సంబంధించి సీబీఐకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఏజీ కోర్టుకు వివరించారు. స్కిల్ కేసు సీబీఐ విచారణకు ఇవ్వడానికి తమకు అభ్యంతర లేదని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. దీంతో, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో సహా 44 మందికి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

స్కిల్ స్కాం విచారణ సీఐడీ నుంచి..సీబీఐ విచారణకు ఇవ్వాలని రిట్ పిటిషన్ లో ఉండవల్లి కోరారు. ఈ కేసు వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉందని ఉండవల్లి వివరించారు. లోతైన విచారణ అవసరమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ, ఏపీ ప్రభుత్వంతోపాటు స్కిల్ స్కాం నిందితులందరినీ ఉండవల్లి తన పిటీషనల్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ : ప్రస్తుతం సీఐడీ చేస్తున్న ఈ విచారణ విషయంలో కోర్టు తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది. ఏపీ ప్రభుత్వం సైతం ఈ కేసును సీబీఐకు ఇవ్వటం తమకు అభ్యంతరం లేదని చెప్పటంతో... నోటీసులకు 44 మంది సమాధానాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అటు స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు..అరెస్ట్..17ఏ పైన సుప్రీంలో క్వాష్ పిటీషన్ విచారణ సాగుతోంది. ఈ రోజు విచారణ తరువాత కోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే ఇటు హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటీషన్ లో నోటీసులు జారీ కావటంతో..స్కిల్ కేసులో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications