Inter Memo's: ఆన్లైన్లో ఇంటర్ మెమోలు.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మెమోలను అందిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ https://bieap.apcfss.in/ ద్వారా కలర్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. మెమోలను ఇప్పటికే ఆన్ లైన్ లో ఉంచినట్లు తెలిపింది. ఈ మెమోలతో ఉన్నత తరగతుల్లో ప్రవేశం పొందవచ్చని వివరించింది. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలైన రోజున మార్కుల లిస్ట్ మాత్రమే ఆన్ లైన్ లో ఉంచారు.
ఇప్పుడు మెమోలను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లగానే.. స్టూడెంట్స్, కాలేజీలు అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. మీరు స్టూడెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ నమోదు చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మెమోలో ఏమైన తప్పులు దొర్లితే సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా ఇంటర్ బోర్డ్ కు ఫిర్యాదు చేసి సరిచేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఏపీలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ లో 484197 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. అలాగే రెండో సంవత్సరంలో 519793 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 26న మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో కూడా 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణత సాధించారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications