ఏ క్షణమైనా రాజధానులు- దుష్టశక్తుల అడ్జు- ఎక్కడినుంచైనా సీఎం పాలన-బొత్స కామెంట్స్
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ దానిపై ముందడుగు వేయడంలో ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధానులపై ఆశలు రేకెత్తించారు. ఏ క్షణమైనా మూడు రాజధానులు అంటూ పాతపాడే పాడారు. ఈ ఏడాది రాజధాని తరలింపు లేదని ఇప్పటికే తేలిపోయినా ఈ ఏడాది, ఆ ఏడాది అంటూ ఏమీ లేదంటూ తేల్చేశారు. దీంతో రాజధానుల వ్యవహారంపై ప్రభుత్వంపై ఎదురవుతున్న విమర్శల్ని కప్పిపుచ్చేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఏ క్షణమైనా మూడు రాజధానులు
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ఆరంభించి ఏడాదిన్నర పూర్తయింది. గతేడాది కరోనాతో రాజధాని తరలింపు జరగలేదని భావించినా ఈసారి కూడా ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్ధితి ఎదురైంది. దీంతో ఇక ముచ్చటగా మూడో ఏడాదే తరలింపు ప్రయత్నాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కారులో కీలకమంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారుయ ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటవుతాయని ప్రకటించారు. ఈ ఏడాది రాజధాని తరలిపోతుందా అని అఢిగితే ఈ ఏడాది ఆ ఏడాది అని లేదు, ఏ క్షణమైనా ప్రక్రియ మొదలవుతుందన్నారు.

టీడీపీది పైశాచికానందం
మూడు రాజధానుల కోసం ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయని, కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని మున్సిపల్ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ, రాజధాని రైతులు పిటిషన్లు వేసిన నేపథ్యంలో వారిని ఉద్దేశించే బొత్స ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్లకూడదని టీడీపీ నేతల కోరికని బొత్స వ్యాఖ్యానించారు. వారిది పైశాచికానందమన్నారు.

శాసనసభలో చట్టమే ఫైనల్
మూడు రాజధానుల ఏర్పాటు కోసం శాసనసభలో ఏ చట్టం చేశామో అది జరిగితీరుతుందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న చర్చలో శాసనసభలో గతంలో ప్రభుత్వం ఆమోదించిన చట్టాలే ఫైనల్ అని మంత్రి బొత్స చెప్పినట్లయింది. ఇప్పటికే శాసనసభ ఆమోదించిన బిల్లులపై హైకోర్టులో పిటిషన్లు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

ఎక్కడి నుంచేలా పాలించొచ్చు
సీఎం ఎక్కడి నుంచైనా పాలించొచ్చంటూ మంత్రి బొత్స మరో కీలక వ్యాఖ్య చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ డోలాయమానంలో పడిన నేపథ్యంలో విశాఖ నుంచి పాలనకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో విశాఖలో గెస్ట్హౌస్కూ ఇంకా అనుమతులు రాలేదు. దీంతో సీఎం జగన్ విశాఖకు ఎలా వెళ్తారన్న చర్చ కూడా సాగుతోంది. దీనికి చెక్ పెడుతూ సీఎం ఎక్కడినుంచైనా పాలించొచ్చంటూ బొత్స క్లారిటీ ఇచ్చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications