ఏపీ మంత్రికి ఐటీ నోటీసులు: అది బినామీ ఎలా అవుతుందన్న జయరాం
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, ఆయన భార్య రేణుకమ్మతోపాటు, ఆలూరు సబ్ రిజిస్ట్రార్కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

30 ఎకరాల భూమిని ఏపీ మంత్రి బినామీగా కొన్నారన్న ఐటీ
జయరాం సతీమణి రేణుకమ్మ పేరుతో ఆస్పరి మండలం చిన్నహోతురు, ఆస్పరిలో 30.83 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి ఐటీ శాఖ అక్టోబర్ 30న మంత్రి జయరాం, రేణుకమ్మ, ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ భూమి కొనుగోలు చేసేందుకు మంత్రి జయరాం డబ్బులు చెల్లించారని ఐటీ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. 30.83 ఎకరాల భూమికి రూ. 52.42 లక్షలు చెల్లించారని, దీన్ని బినామీగా పేర్కొన్నారు.

తమపై బురజల్లేందుకే దుష్ప్రచారమన్న జయరాం
కాగా, నోటీసులు అందుకున్న 90 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఐటీ శాఖ అధికారులు అందులో పేర్కొన్నారు. అయితే, తమకు ఎలాంటి నోటీసులు అందలేదని మంత్రి జయరాం తెలిపారు. ఆలూరులోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఛానెళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తనపై బురదజల్లేందుకు ఇలా చేస్తున్నాయని మండిపడ్డారు.

అలా కొంటే బినామీ ఎలా అవుతుందన్న జయరాం
తమది ఉమ్మడి కుటుంబమని.. 1995లో తన తల్లి సర్పంచ్గా, 2006లో తాను జడ్పీటీసీగా పనిచేశామని తెలిపారు ఏపీ మంత్రి జయరాం. 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని, 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిని అయ్యానని జయరాం చెప్పారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న తాము 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. కుటుంబసభ్యుల పేరు మీద భూమి కొంటే బినామీ ఎలా అవుతుందని మంత్రి జయరాం ప్రశ్నించారు. కాగా, ఇటీవల తెలంగాణలో కూడా ఓ మంత్రి, ఆయన కుటుంబసభ్యులను ఐటీశాఖ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అక్కడ పలు వ్యవహారాల్లో ఈడీ విచారణలు కూడా కొనసాగుతున్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications