ఏపీకి హోదా, హామీల అమలుపై కాంగ్రెస్ ప్లీనరీలో తీర్మానం
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్లీనరీలో తీర్మానం చేశారు. మన్మోహన్ హయాంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని ఇందిరాగాంధీ స్టేడియంలో అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన పార్టీ 84వ ప్లీనరీలో కాంగ్రెస్ పునరుద్ఘాటించింది.
ఏపీ హామీల అమలులో జరిగిన అన్యాయం, కేంద్రం నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. తీర్మానంపై చర్చించిన అనంతరం ప్లీనరీ ఆమోదించనుంది. విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించిన సమయంలో హోదాతోపాటు పలు హామీలను కేంద్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.
దేశ ప్రజలు, అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు: ప్లీనరీలో రాహుల్
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ పార్లమెంటులో ఇప్పటికే టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.