వైసీపీలో నియామకాలు: చిలుకలూరిపేటకు విడదల రజిని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం నియామకాల ప్రకటన విడుదల చేసింది. చిలుకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజినీని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు ) నియమితులయ్యారు.
కార్యకర్తలకు అండగా ఉంటానన్న జగన్
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాక్షస ఎల్లో మీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ యుద్ధంలో ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని జగన్ వ్యాఖ్యానించారు.

మేము రాక్షస ఎల్లో మీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో మా కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో మా ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తా. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
We are waging a war against a demonic yellow media and it’s unethical social media. In this battle illegal detentions, undue harassment and false cases are the order of the day . I am with you in each of these battles, truth alone shall prevail.#WeStandForTruth… pic.twitter.com/dfTbNEO1Hi
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2024
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన దుర్యోధన దుశ్సాసన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైయస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, పార్టీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని జగన్ తోపాటు వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications