arasavalli rathasapthami: సూర్యనారాయణుడి శోభాయాత్ర.. హెలికాఫ్టర్ నుండి అరసవల్లి అందాలు!
శ్రీకాకుళం జిల్లా కేంద్రం arasavalli rathasapthami కి భక్తిపారవశ్యంలో మునిగితేలింది. సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని నేడు సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. 55 రకాలకు పైగా జానపద, సాంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అరసవల్లి సూర్య నారాయణుడి రథ సప్తమి వేడుకలకు ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాట్లు చేసింది.

మంగళవాయిద్యాల మధ్య సాగిన సూర్యరథం
నేడు కె.ఆర్.స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన ధర్మపత్నితో కలిసి స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ వెంట రాగా సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను వైభవంగా ప్రారంభించారు.శంఖారావాలు, మంగళవాయిద్యాల మధ్య సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గమ్మ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

55 రకాలకు పైగా జానపద, సాంప్రదాయ కళారూపాలతో శోభాయాత్ర
మహిళల కర్రసాము, అఘోరాల వేషధారణలు, కేరళ డ్రమ్స్, ధింసా నృత్యాలు యాత్రకు వన్నె తెచ్చాయి. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలి, సూర్యమహల్, మిల్ జంక్షన్ మీదుగా అరసవల్లి ఆలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. కార్యక్రమంలో అధికార యంత్రాంగం, భక్తులతో కలసి పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు.

దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనలు
యాత్ర ఆద్యంతం క్రమశిక్షణతో సాగేలా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. యాత్ర వల్ల దారిపొడవునా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ప్రసాద వితరణ చేపట్టాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.

అరసవల్లిలో హెలికాఫ్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్
మరోవైపు అరసవల్లి పుణ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ను అందుబాటులోకి తెచ్చింది జనవరి 19వ తేదీ నుండి ప్రారంభమైన ఈ వైమానిక వ్యవహారాలు భక్తులకు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. హెలికాప్టర్ రైడ్స్ కు 2002 వందల రూపాయలు చార్జీ నిర్ణయించగా , హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ధర మొదట వెయ్యి రూపాయలు పెట్టి ఆ తర్వాత భక్తుల విజ్ఞప్తి మేరకు 799 రూపాయలకు తగ్గించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications