Asia Cup 2025: లైవ్ లేకపోతే మళ్లీ ఆ ఘోరం ..! పాక్ పై సాయిరెడ్డి పంచ్ లు..!
నిన్న దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా పాకిస్తాన్ పై రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. అంతే కాదు ఈ టోర్నీలో వరుసగా మూడోసారి పాకిస్తాన్ ను ఓడించి అంతర్జాతీయ టోర్నీల్లో తమ సత్తా చాటుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అదే సమయంలో పాకిస్తాన్ పై పంచ్ లు పేలుతున్నాయి. రాజకీయ నేతలు, మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో పాక్ కు చురకలు అంటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ పై స్పందించారు. ఓవైపు ఆసియాకప్ టోర్నీ టైటిల్ గెల్చిన టీమిండియా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరోవైపు పాకిస్తాన్ పై పంచ్ లు పేల్చారు. ముఖ్యంగా నిన్నటి ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాకుండా ఉంటే ఏం జరిగేదో సాయిరెడ్డి వివరించారు. గతంలో పాకిస్తాన్ ఆడిన ఓ అబద్ధానికి దాన్ని సాయిరెడ్డి లింక్ చేశారు.

Congratulations Pakistan🏆🇵🇰#indvspak2025 pic.twitter.com/R7s4xTnfaI
— Wahida 🇦🇫 (@RealWahidaAFG) September 28, 2025
ఆసియాకప్ ఫైనల్ పై సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరిగినందుకు ముందుగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నారు. లేకుంటే పాకిస్తాన్ మ్యాచ్ గెలిచినట్లు చెప్పుకునేదన్నారు. టోర్నమెంట్ అంతటా మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ మరియు అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శనలతో ఆసియా కప్ గెలిచినందుకు జట్టుకు సాయిరెడ్డి అభినందనలు తెలిపారు.
Thank God the match was live telecast otherwise Pakistan would have claimed to have won the match. Congratulating our team for winning the #AsiaCup2025 with excellent performances from our Telugu player Tilak Verma and Abhishek Sharma throughout the tournament. pic.twitter.com/V9CVH3fRBG
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 29, 2025

గతంలో ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో ఇలాగే భారత్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ విమానాలతో పాటు రక్షణ వ్యవస్థలను కూడా కూల్చింది. అయితే చివరికి కాల్పుల విరమణ తర్వాత మాత్రం పాకిస్తాన్ ఈ యుద్ధంలో గెలిచినట్లు తమ దేశంలో చెప్పుకుంది. ఎందుకంటే యుద్ద రంగంలో జరిగే ప్రతీ దాడికీ కచ్చితమైన సాక్ష్యాలు ఉండే అవకాశాలు లేవు. అయినా భారత్ మాత్రం తాము పాకిస్తాన్ కు చేసిన నష్టాల్ని దాదాపుగా టెక్నాలజీ సాయంతో బయటపెట్టింది. ఇప్పుడు దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications