వనజాక్షి హద్దు దాటి గొడవ పెట్టుకుంది, కాపాడాలని చూశా: చింతమనేని
విజయవాడ: తహసీల్దారు వనజాక్షి ఘటన దాడి పైన తెలుగుదేశం పార్టీ దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ గురువారం నాడు విచారణ కోసం వేసిన శర్మ కమిటీ ముందు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సవాల్ చేశారు.
వనజాక్షి పైన తాను దాడి చేశానన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. వనజాక్షి పైన తాను దాడికి పాల్పడినట్లు, అలాగే ఇసుకును అక్రమంగా తరలించినట్లు శర్మ కమిటీ ఒక్క మాట చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

వనజాక్షియే సరిహద్దు దాటి వచ్చి డ్వాక్రా మహిళలతో గొడవకు దిగారన్నారు. ఈ ఘటనలో వనజాక్షి కిందపడిందని చెప్పారు. ఆ సమయంలో కిందపడిన వనజాక్షిని తాను కాపాడేందుకు ప్రయత్నాలు చేశానని చింతమనేని ప్రభాకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications