ల్యాప్టాప్, సెల్ఫోన్ల, నగలు చోరీ: బిటెక్ విద్యార్థి అరెస్టు
చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన ఓ బిటెక్ విద్యార్థి దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. మదనపల్లె నీరుగట్టుపల్లెకు చెందిన రాజేష్ నెల్లూరులో ట్రిపుల్ఈ చదువుతున్నాడు. నెల్లూరు నగరంతో పాటు మదనపల్లెకు వచ్చినప్పుడు ఇళ్లలో చొరబడి చోరీలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు.
విలువైన ల్యాప్టాప్లు, కెమెరాలు, సెల్ఫోన్లు, నగలు, నగదు చోరీ చేసేవాడు. శనివారం ఉదయం మదనపల్లెలో ఉండగా పోలీసులు వలపన్ని అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్లు, నగలు, ఓ స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే కార్యాలయంలో ఓ వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతి చెందిన వ్యక్తిని గుంతకల్లులో డిపిఓ సెక్షన్ ఆఫీస్ సూపరింటిండెంట్గా పనిచేస్తున్న అజీజ్ పాషా (42)గా గుర్తించారు.
మృతుడు కర్నూలు జిల్లా వాసి అని తెలిపారు. ఇతనికి పెళ్లి కాలేదు. ఒంటరిగా శాంతినగర్లోని 625 నంబర్ క్వార్టర్లో ఉంటున్నాడు. అయితే శనివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండగా ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications