Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Badvel Huzurabad Bypolls: ముగిసిన హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికలు, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం

రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనును బరిలో నిలిపింది. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ జరగనుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కూడా ఉపఎన్నిక జరుగుతుంది. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వైసీపీ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధ బరిలో నిల్చుంటుండగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తమ అభ్యర్థిని పోటీగా నిలబెట్టడం లేదని ప్రకటించింది. ఇక బీజేపీ నుంచి పంతాల సురేష్ పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో ఉన్నారు.

Badvel and Huzurabad bypolls live updates in telugu, To which party are the voters looking at

ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు లైవ్‌లో మీకోసం

Oct 30, 2021, 7:35 pm IST

చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్, బద్వేలు ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
Oct 30, 2021, 7:15 pm IST

పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.
Oct 30, 2021, 7:14 pm IST

బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికలు ముగిశాయి.
Oct 30, 2021, 7:04 pm IST

హుజూరాబాద్ ఉపఎన్నికలో పోలింగ్ శాతం 90 శాతం దాటే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.
Oct 30, 2021, 6:37 pm IST

బద్వేలు ఉపఎన్నిక: వరికుంటల్లో వైసీపీ శ్రేణులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీజేపీ అడ్డుకుంది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Oct 30, 2021, 5:43 pm IST
ఆంధ్రప్రదేశ్

బద్వేలు ఉపఎన్నిక: సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం ఓటింగ్ నమోదైంది.
Oct 30, 2021, 5:28 pm IST

హుజూరాబాద్ ఉపఎన్నిక: సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదైంది
Oct 30, 2021, 5:02 pm IST

హజూరాబాద్ ఉపఎన్నిక: డబ్బు పంపిణీపై ఫిర్యాదులు అందాయని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు శశాంక్ గోయల్.
Oct 30, 2021, 4:50 pm IST

హజూరాబాద్ ఉపఎన్నిక: ఇప్పటి వరకు తమకు 88 ఫిర్యాదులు అందాయని గోయల్ తెలిపారు.
Oct 30, 2021, 4:49 pm IST

హజూరాబాద్ ఉపఎన్నిక: 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని శశాంక్ గోయల్ తెలిపారు.
Oct 30, 2021, 4:48 pm IST

హజూరాబాద్ ఉపఎన్నిక: కమలాపూర్‌లో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తనిఖీ చేశారు.
Oct 30, 2021, 4:33 pm IST

హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
Oct 30, 2021, 3:40 pm IST

హుజూరాబాద్ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉత్తమమైన నాయకుడిని ఎన్నుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.
Oct 30, 2021, 3:39 pm IST

హుజూరాబాద్ నియోజకవర్గంలో స్వల్ప ఘర్షణలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి.
Oct 30, 2021, 3:26 pm IST
ఆంధ్రప్రదేశ్

బద్వేలులో మధ్యాహ్నం 3 గంటల వరకు 45 శాతం పోలింగ్ నమోదైంది.
Oct 30, 2021, 3:09 pm IST

హూజూరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం ఓటింగ్ నమోదైంది.
Oct 30, 2021, 3:07 pm IST

నాన్ లోకల్ అయిన బీజేపీ నేత తుల ఉమ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఉన్నారంటూ టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు ఆమెను వెనక్కి పంపారు.
Oct 30, 2021, 2:19 pm IST
తెలంగాణ

హుజూరాబాద్ పట్టణంలో డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు పట్టుకున్నారు. అతడు స్థానికేతరుడని చెప్పారు. అతడ్ని పోలీసులకు అప్పగించారు.
Oct 30, 2021, 1:58 pm IST

బద్వేలులో ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Oct 30, 2021, 1:44 pm IST

హుజూరాబాద్‌లో ఒంటిగంట సమయానికి 45.63శాతం పోలింగ్ నమోదు
Oct 30, 2021, 1:44 pm IST

బద్వేలులో ఒంటిగంట సమయానికి 35.47 శాతం పోలింగ్ నమోదు
Oct 30, 2021, 11:40 am IST

బద్వేలులో ఉదయం 11 గంటల సమయానికి 20.89శాతం పోలింగ్ నమోదు
Oct 30, 2021, 11:10 am IST

హుజూరాబాద్‌లో ఉదయం 11 గంటల సమయానికి 33.27 శాతం పోలింగ్ నమోదు
Oct 30, 2021, 11:06 am IST

బద్వేలు నియోజకవర్గంలో బయట వ్యక్తులు వచ్చి డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు
Oct 30, 2021, 10:48 am IST

బద్వేల్‌లో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్
Oct 30, 2021, 10:40 am IST
తెలంగాణ

జమ్మికుంటలో స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకుల ఆరోపణ
Oct 30, 2021, 10:11 am IST
కర్నాటక

హనగల్ అసెంబ్లీ స్థానంలో ఈ ఉదయం 9 గంటల వరకు 8.77 శాతం మేర నమోదైన ఉప ఎన్నిక పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్. సిందగి స్థానానికి కూడా ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.
Oct 30, 2021, 10:04 am IST
తెలంగాణ

హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌ను సందర్శించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. భార్యతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Oct 30, 2021, 10:02 am IST
తెలంగాణ

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కొనసాగుతున్న పోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గం పరిధిలోని ఇల్లంతకుంట మండలం కోరుకల్ గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు సకాలంలో స్పందించారు. వారిని చెదరగొట్టారు.
Oct 30, 2021, 10:00 am IST
పశ్చిమ బెంగాల్

దిన్హాత అసెంబ్లీ స్థానానికి పోలింగ్ సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రానికి రాకుండా కొందరు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని బీజేపీ అభ్యర్థి అశోక్ మండల్ ఆరోపించారు.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+