Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి రైతులకు అండగా బాలకృష్ణ: పండుగకు చంద్రబాబు దూరం: పోరాటానికి మద్దతుగా..!

మూడు రాజధానులు..పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపు ప్రతిపాదనల పైన అమరావతిలో నిరసనలు హోరెత్తుతున్నాయి. స్థానిక మహిళలు..రైతులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల దీక్షల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. జనసేన అధినేత పవార్టీలున్ సైతం రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అధికార వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు రైతుల పోరాటానికి మద్దతుగా..అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఇక, ఇప్పుడు సినీ హీరో...హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సైతం సంక్రాంతి నాడు రైతుల కు మద్దతుగా అమరావతికి వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భువనేశ్వరి..నందమూరి రామకృష్ణ సైతం రైతుల వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండాలని.. ప్రతీ ఏటా నారా వారి పల్లెకు వెళ్లే నారా..నందమూరి కుటుంబాలు ఈ సారి అమరావతిలో రైతులతో ఉండాలని నిర్ణయించారు.

రైతులకు మద్దతుగా బాలకృష్ణ..
రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించలేదు. టీడీపీ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు రైతులు చేస్తున్న ఆందోళనల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. జనవరి 1న సతీ సమేతంగా చంద్రబాబు అక్కడ రైతుల దీక్షల్లో పాల్గొన్నారు. భువనేశ్వరి తన చేతికి ఉన్న ప్లాటినం గాజులను సైతం ఉద్యమానికి విరాళం గా అందించారు. రాయలసీమ టీడీపీ నేతలు సైతం అమరావతి రాజధానిగా కొనసాగించాలని లేకుంటే..తమకు ప్రత్యేక గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు రాయలసీమ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సైతం అమరావతి రైతులకు మద్దతుగా సంక్రాంతి పండుగ రోజుల్లో రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని సమాచారం. పార్టీ అధినేతతో కలిసి ఆయన కుటుంబ సమేతంగా రైతుల దీక్షల వద్దకు వెళ్లి..వారికి మద్దతు ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Balakrishna may participate in Amaravati farmers agitation on Pongal day

సంక్రాంతి పండుగకు దూరం
సంక్రాంతికి నారావారిపల్లె వెళ్లే కార్యక్రమాన్ని టీడీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సంక్రాంతి వేడుకల్లో నారా..నందమూరి కుటుంబాలు పాల్గొంటాయి. అయితే, ఈ సారి అమరావతిలో రైతులు ఆందోలనళ్లో ఉండటంతో తాము సైతం సంక్రాంతికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. నారావారి పల్లెలోనే మూడు రోజుల పాటు ఉండి అక్కడే పండుగ ను ఈ రెండు కుటుంబాలు కలిసి నిర్వహించేవి. ఈ సారి సంక్రాంతి వేడుకలకు సొంతూరు వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోనే ఉండి రైతులకు సంఘీభావం ప్రకటించాలని బాబు నిర్ణయించారు. పండుగ రోజున సైతం రైతులతో కలిసి దీక్షలకు మద్దతు ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేడకులకు సైతం చంద్రబాబు దూరంగా ఉన్నారు. పార్టీ సైతం కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+