ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఖాయమంటున్న బాలకృష్ణ
హిందూపురం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించబోతున్నానని నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని జేవీఎస్ ప్యాలెస్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించబోతున్నానని స్పష్టం చేశారు. జరిగే ఎన్నికల మహా సంఘంలో రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో ఉండే వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం భ్రష్ట పట్టించిందని మండిపడ్డారు.

టీడీపీ పాలనలో రాయలసీమ ఎంతో ప్రశాంతంగా ఉండేదని జగన్ ప్రభుత్వం వచ్చాక రక్తం పారిందని విమర్శించారు. మద్యపానాన్ని నిషేదిస్తామని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్.. నా అక్కలు, నా చెల్లెలు అంటూ చెబుతున్న వారికే వెన్నుపోటు పొడిచారని బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్రాన్ని మరో 10 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి రావాలని బాలకృష్ణ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందని బాలకృష్ణ అన్నారు.
రాష్ట్రానికి సుస్థిరమైన పాలన అందించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, జనసేన జిల్లా కన్వీనర్ వరుణ్, స్థానిక నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications