జగన్ పార్టీలోకి బాలశౌరి, కెవిపి వియ్యంకుడు కృష్ణంరాజు
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణం రాజులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆదివారం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో లోటస్ పాండులో తన అనుచరులతో కలిసి బాలశౌరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమనే ఉద్దేశ్యంతో తాను పార్టీలో చేరినట్లు బాలశౌరి చెప్పారు. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ సానుకూలంగా లేఖ ఇస్తే కాంగ్రెసు దాని పైన నిర్ణయం నిర్ణయం తీసుకుందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు తీరాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
మరోవైపు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు వియ్యంకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణం రాజు కూడా జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే చేరారు.