వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నిధులకు లెక్కలేవీ, ఏపీని బాబు అప్పుల్లోకి నెట్టాడు, సినిమా డైరెక్టర్లతో డిజైన్లా?: కన్నా

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్రం నుండి వచ్చిన నిధులకు లెక్కలు చూపలేదని బిజెపి నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కనీసం డీపిఆర్‌లు ఇవ్వకుండా నిధులు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలా నిధులను మంజూరు చేస్తోందని కన్నాలక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

మిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనంమిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనం

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబారా ఖర్చులు చేస్తూ రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Recommended Video

TDP leaders Protest BJP MLC's Remarks Against Babu

బిజెపి ఒక్క రూపాయి ఇవ్వదు, టైమ్ పాస్ చేస్తోంది, కాంగ్రెస్‌కు పట్టిన గతే: రాయపాటి సంచలనంబిజెపి ఒక్క రూపాయి ఇవ్వదు, టైమ్ పాస్ చేస్తోంది, కాంగ్రెస్‌కు పట్టిన గతే: రాయపాటి సంచలనం

టిడిపిపై బిజెపి నేతలు ఇటీవల కాలంలో విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు టిడిపిపై చేస్తున్న విమర్శలకు తోడుగా మరో బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కూడ జత కలిశారు.

'బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు''బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు'

బుదవారం నాడు బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ టిడిపి నేతలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి నేతలు విమర్శలు చేశారు.

 ఏపీని టిడిపి అప్పుల పాలు చేసింది

ఏపీని టిడిపి అప్పుల పాలు చేసింది

ఏపీ రాష్ట్రాన్ని టిడిపి ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు.ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజల డబ్బును వృథాగా ఖర్చు చేస్తున్నారని, అనవసర ఖర్చులతో ఏపీని అప్పులు పాలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.ప్రభుత్వానికి పని తక్కువ, ప్రచార ఆర్భాటాలు ఎక్కువని విమర్శించారు.

రాజధానికి సినిమా డైరెక్టర్లతో డిజైన్లు సమంజసమా

రాజధానికి సినిమా డైరెక్టర్లతో డిజైన్లు సమంజసమా

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే ఈ నిధులతో ఏయే నిర్మాణాలు చేపట్టారో చెప్పాలని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయన ప్రశ్నించారు. ఇచ్చిన సొమ్ముకు లెక్కలు చూపని ఏపీ ప్రభుత్వం, కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేదని, పైగా నిధులు ఇవ్వమని కేంద్రాన్ని కోరుతోందని విమర్శించారు. సినిమా డైరెక్టర్‌తో రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు చేయిస్తారా అని బిజెపి నేతల కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

కొనసాగుతున్న బిజెపి నేతల విమర్శలు

కొనసాగుతున్న బిజెపి నేతల విమర్శలు

ఏపీ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వంపై టిడిపి నేతలపై కొందరు బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపి నేతల తీరుపై టిడిపి నేతలు కూడ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు టిడిపి నేతలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై బిజెపి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. తాజాగా మరో బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కూడ టిడిపిపై విమర్శలు గుప్పించారు.

ఉద్దేశపూర్వకంగానే విమర్శలా

ఉద్దేశపూర్వకంగానే విమర్శలా

టిడిపిని లక్ష్యంగా చేసుకొని కొందరు బిజెపి నేతలు ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. బిజెపి నేతలు అందరూ కూడ విమర్శలు చేయకపోయినా, కొందరు మాత్రం పనిగట్టుకొని టిడిపిపై విమర్శలు చేయడంపై టిడిపి నేతలు అనుమానాలను కూడ వ్యక్తం చేస్తున్నా

English summary
BjP leader, former minister Kanna Laxminarayana made allegations on Ap chief minister Chandrababunaidu on Wednesday at Guntur.He spoke to media on Wednesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X