వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచితకు మరో ఆఫర్: మొన్న సింహాచలం ట్రస్టు బోర్డులో చోటు..నేడు మన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా..!

|
Google Oneindia TeluguNews

విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు కుటుంబానికి చెందిన సంచిత గజపతి రాజుకు మరో ఆఫర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. విజయనగరం జిల్లాల్లో ప్రతిష్ఠాత్మకమైన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్సాస్) ట్రస్టు ఛైర్ పర్సన్‌గా సంచిత గజపతి రాజును నియమించింది. కొద్దిరోజుల కిందటే సింహాచలం దేవస్థానం పాలక మండలిలో సంచితకు చోటు కల్పించిన ప్రభుత్వం.. ఈ సారి మన్సాస్ ట్రస్ట్ పగ్గాలను అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

1958లో గజపతి రాజుల వంశానికి చిట్టచివరి క్రౌన్డ్ ప్రిన్స్‌ పూసపాటి విజయ్ రామ్ గజపతి రాజు ఈ మన్సాస్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ గజపతి రాజుల కుటుంబానికి చెందిన వారే దీనికి ఛైర్మన్లుగా ఉంటూ వస్తున్నారు.

BJP leader Sanchita Gajapathi Raju appointed as a Chairperson of Mansas trust in Vizianagaram

ప్రస్తుతం టీడీపీ సీనియర్ నాయకుడు అశోక గజపతి రాజు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ట్రస్ట్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది..

BJP leader Sanchita Gajapathi Raju appointed as a Chairperson of Mansas trust in Vizianagaram

Recommended Video

ప్రారంభ‌మైన ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు..! | Oneindia Telugu

ఈ పరిస్థితుల్లో అశోక గజపతి రాజును తొలగించి.. సంచితకు స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. బుధవారమే ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అశోక గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతి రాజు కుమార్తె సంచిత. రెండేళ్ల కిందటే ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆమెను దేవాదాయ మంత్రిత్వ శాఖ ఆమెను సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా నియమించింది. తాజాగా మన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా నియమించడం ఆసక్తిగా మారింది.

English summary
BJP leader Sanchita Gajapathi Raju appointed as a Chairperson of Mansas trust in Vizianagaram in Andhra Pradesh. Sanchita Gajapathi Raju is replaced the TDP Senior leader and former Union minister Ashok Gajapathi Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X