చంద్రబాబు ఇష్టం, నా కొడుక్కి కిరీటం పెట్టరుగా: బొజ్జల, బోండాకు బాబు ఝలక్
తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కన్నా తన ఆరోగ్యం ముఖ్యమని చంద్రబాబు చెప్పారని, అందుకే తనను తొలగించినట్లు తెలిపారు.
అమరావతి: తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కన్నా తన ఆరోగ్యం ముఖ్యమని చంద్రబాబు చెప్పారని, అందుకే తనను తొలగించినట్లు తెలిపారు.
మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇష్టమని చెప్పారు. ఇష్టం ఉన్నా లేకున్నా తాను చేసేది ఏదీ లేదని చెప్పారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. తన వారసుడైతే ప్రజలు కిరీటం పెట్టరని, ప్రజల నుంచి రావాలన్నారు.

తొలిసారే మంత్రి పదవి అడగటం భావ్యమా?: బోండాతో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అడగటం భావ్యమా? అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన బొండా ఉమాను ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ బుజ్జగించి ఆదివారం సీఎం వద్దకు తీసుకెళ్లారు. కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో ఉన్న ప్రాధాన్యతను బొండాకు వివరించిన సీఎం చంద్రబాబు.. ఆ సామాజికవర్గం నుంచి అయిదుగురికి మంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications