Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కులాల ఆధిపత్య పోరులోనే బొత్స టార్గెట్: పాల్వాయి

Palwai Govardhan Reddy
హైదరాబాద్: సీమాంధ్రలో మూడు కులాల ఆధిపత్య పోరులో భాగంగానే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కమ్మ, కాపు, రెడ్డి కులాల మధ్య సీమాంధ్రలో ఆధిపత్య పోరు సాగుతోందని, ఇందులో భాగంగానే బొత్సను లక్ష్యం చేసుకున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని విడగొట్టాలని బొత్స సత్యనారాయణ ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు ఆంధ్ర నాయకుల తప్పు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పడం వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆ ప్రాంత పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్షలకు పూనుకోవడం సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన అన్నారు.

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామిని ఆయన శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొందరు పెట్టుబడిదారుల కనుసన్నల్లో కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తన మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. సోదరభావంతో విడిపోదామని ఆయన సీమాంధ్రులకు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+