కులాల ఆధిపత్య పోరులోనే బొత్స టార్గెట్: పాల్వాయి

రాష్ట్రాన్ని విడగొట్టాలని బొత్స సత్యనారాయణ ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు ఆంధ్ర నాయకుల తప్పు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పడం వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆ ప్రాంత పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్షలకు పూనుకోవడం సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన అన్నారు.
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామిని ఆయన శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొందరు పెట్టుబడిదారుల కనుసన్నల్లో కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తన మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. సోదరభావంతో విడిపోదామని ఆయన సీమాంధ్రులకు సూచించారు.












Click it and Unblock the Notifications