జాగ్రత్తలు తీసుకోవాల్సింది: విద్యుత్ ప్లగ్లో వేలు పెట్టి చిన్నారి మృతి
పశ్చిమగోదావరి: చిన్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగానే చూసుకుంటారు. కానీ, ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా, జరిగిన విషాద ఘటన ఈ తల్లిదండ్రుల జీవితంలో తీరని విషాదాన్ని నింపింది.
విద్యుత్ ప్లగ్లో వేలుపెట్టి ఓ చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరుకు చెందిన అబ్బిండి సురేష్, స్వాతి దంపతులకు పూర్ణధర్మతేజ(18 నెలలు) కుమారుడు, నాలుగు నెలల కుమార్తె ఉన్నారు.

కాన్పు కోసం స్వాతి పుట్టిల్లు కృష్ణాజిల్లా బాపులపాడుకు వచ్చి ఇక్కడే ఉంది. గురువారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న పూర్ణధర్మతేజను ఎవరూ గమనించని సమయంలో విద్యుత్ ప్లగ్లో వేలు పెట్టాడు.
విద్యుదాఘాతానికి గురికావడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. శుక్రవారం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్షలు చేశారు. రెండేళ్లు కూడా నిండని కుమారుడి మరణంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications