ఒంగోలులో క్షుద్రపూజలకు చిన్నారి బలి, ఎస్సైకి చుక్కలు చూపిన అల్లరి మూక

అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని మదర్ థెరిస్సా కాలనీలో క్షుద్రపూజలకు రెండు నెలల పసికందును హతమార్చారు. తల్లిదండ్రులే ఈ ఘోరానికి పాల్పడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎస్సైకి చుక్కలు చూపిన అల్లరి మూకలు

విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే ఆ ఎస్సై కాస్తంత విశ్రాంతి తీసుకుని భార్యతో కలిసి సరదాగా సినిమా చూద్దామని వెళ్లారు. అయితే థియేటర్‌లో అల్లరి మూకలు మళ్లీ విధి నిర్వహణలోకి వచ్చేలా చేశాయి. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

 Boy killed in suspected black magic ritual in Ongole

నగరంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై చౌడయ్యకు శ్రీనివాస థియేటర్‌లో సినిమా చూసేందుకు ఆదివారం రాత్రి తన భార్యతో కలిసి థియేటర్‌కు వెళ్లారు. థియేటర్ సినిమా చూస్తున్న సమయంలో అల్లరిమూకలు అల్లరి చేశారు. ఈ క్రమంలో అల్లరి చేయొద్దంటూ ఆయన ఆకతాయిలను వారించారు. మద్యం మత్తులో ఉన్న సదరు అల్లరిమూక ఎస్సై దంపతులపై దాడికి దిగింది.

సినిమా చూద్దామని వచ్చిన తనకు ఈ తరహా ఘటన ఎదురుకావడంతో సదరు ఎస్సై షాక్ తిన్నారు. వెనువెంటనే తేరుకున్న సదరు ఎస్సై తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు అల్లరిమూకల్లోని ఓ ఆకతాయిని అరెస్ట్ చేసి, మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+