జనసేన ఆశలపై "బకెట్" నీళ్లు - పోలింగ్ లెక్కలతో కొత్త టెన్షన్..!!
ఏపీలో పోలింగ్ వేళ చోటు చేసుకున్న అనూహ్య అంశాలు బయటకు వస్తున్నాయి. గెలుపు పైన భారీ ఆశలు పెట్టుకున్న అభ్యర్దుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. జనసేన ఎన్నికల ముందే సింబల్ విషయంలో ఆందోళన చెందింది. పోలింగ్ సరళి విశ్లేషణ సమయంలో ఆ పార్టీ నేతలు ఆందోళన నిజం అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో పోటీ చేసిన కొందరు జనసేన అభ్యర్దల్లో ఈ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో..ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.
గుర్తులతో చిక్కులు
జనసేన ఏపీలో 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. తొలుత జనసేన సింబల్ గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించారు. ఆ తరువాత జనసేన న్యాయ పోరాటం చేసింది. ఫలితంగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లోని పార్లమెంట్ పరిధిలో మరెవరికీ గాజు గ్లాసు గుర్తు ఇవ్వమని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. కానీ, బకెట్ గుర్తు పైన జనసేన నేతల్లో అప్పట్లోనే ఆందోళన కనిపించింది. తెలంగాణలో బీఆర్ఎస్ గుర్తు కారుతో పోలిన పడవ గుర్తు ఆ పార్టీకి ఎన్నికల్లో రావాల్సిన ఓట్లను గండి కొట్టింది. ఫలితాలనే తారు మారు చేసింది.

గోదావరిలో కొత్త టెన్షన్
దీంతో..ఎన్నికల ముందే జనసేన నేతలు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బకెట్ గుర్తు లేకుండా చూడాలని కోరారు. అయితే, పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్దులు బకెట్ గుర్తుతో పోటీలో నిలిచారు. ప్రధానంగా తూర్పు గోదావరిలో ఒక కీలక నియోజకవర్గంలో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తంగా ఫలితాన్నే నిర్దేశించే విధంగా మారింది. వైసీపీ - జనసేన మధ్య హోరా హోరీగా మారిన ఈ ఎన్నికల పోరులో ఇరు పార్టీల అభ్యర్దులు గెలుపు పైన ధీమాతో ఉన్నారు. అయితే, జనసేన ఈ నియోజకవర్గం నుంచి గెలుపు పైన భారీ అంచనాలతో కనిపించింది.

ఫలితం మార్చేసేలా
పోలింగ్ పూర్తయిన తరువాత నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన పోలింగ్ కేంద్రాల సమాచారం..ఓటింగ్ సరళి...పోలైన ఓట్లను పరిశీలించిన తరువాత ఆసక్తి కర అంశాలు గుర్తించారు. గాజు గ్లాసుకు వేయాల్సిన ఓట్లు బకెట్ కు పోలైనట్లు క్షేత్ర స్థాయి సమాచారంలో జనసేన నేతలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఓటింగ్ సరళి పైన సమీక్షలో పార్టీ నేతలు ఏకరువు పెట్టారు. తాము మెజార్టీ సాధిస్తామని చెబుతున్న ఓట్ల స్థాయిలోనే బకెట్ గుర్తుకు ఓట్లు పోలయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో..తాము అంచనా వేస్తున్న మెజార్టీ కంటే తక్కువ ఉంటే పర్వాలేదని..లేకుంటే తమకు నష్టం తప్పదని జనసేన నేతలు పార్టీ ముఖ్యుల వద్ద వాపోయినట్లు సమాచారం. దీంతో..ఆ నియోజకవర్గంలో ఇప్పుడు కౌంటింగ్ మరింత ఉత్కంఠ పెంచుతోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications