ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నిధులు-పార్టీలకతీతంగా: రాజధాని ప్రస్తావన లేకుండానే..!!
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ లో ఎమ్మెల్యేలకు వరం ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు..కరోనా కారణంగా రాష్ట్రంలో డెవలప్ మెంట్ కోసం నిధులను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యేకంగా మంజూరు చేయలేదు. అయితే, 2024 ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభిస్తున్న సీఎం జగన్ ముందుగా పార్టీ ఎమ్మెల్యేలను సంసిద్దులను చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా డెవలప్ మెంట్ పనుల కోసం నిధులు మంజారు చేయాలని కోరుతూ వస్తున్నారు.
Recommended Video

నియోజకవర్గాలకు నిధులు
దీంతో.. శాసనసభలోని ఎమ్మెల్యేలందరికీ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరి నియోజక వర్గానికి రెండు కోట్ల చొప్పున కేటాయించారు. ఎమ్మెల్యేలు గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఈ నిధులు మంజూరు చేస్తారు. దీనిని మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ఫండ్ గా దీనిని ఖరారు చేసారు. ఇందు కోసం తాజా బడ్జెట్ లో రూ 350 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఇక, అమరావతిని ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీని కోసం అమరావతికి నిధుల కేటాయింపు పైన అందరూ ఆసక్తిగా చూసారు. కానీ, బడ్జెట్ లో ఎక్కడా ప్రత్యేకంగా అమరావతి ప్రస్తావన లేదు.

మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే
అదే విధంగా మూడు రాజధానుల గురించి మంత్రి బుగ్గన తన ప్రసంగంలో ప్రస్తావనకు తీసుకురాలేదు. మౌళిక సదుపాయాల కల్పనలోనూ అమరావతి గురించి చెప్పలేదు. అర్బన్ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రూ 8,796.33 కోట్లను కేటాయించింది. అయితే, అందులో అనుబంధ పద్దుల్లో అమరావతి లేదా మూడు రాజధానుల కోసం ఏమైనా కేటాయింపులు ఉన్నాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాల విభజన ద్వారా ప్రభుత్వం సుపరిపాలన దిశగా మరో అడుగు ముందుకేస్తోందని మంత్రి బుగ్గన తన ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. సుస్థిరమైన పాలన అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. సమ్మిళిత - సుస్థిర పాలన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నామని బుగ్గన చెప్పుకొచ్చారు.

ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు
ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ కు రూ. 11, 482.37 కోట్లు కేటాయించిన ప్రభుత్వం వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు పూర్తి దిశగా చర్యలు తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసారు. ఇక, పెరిగిన పీఆర్సీ వేతనాలు..ప్రభుత్వ నిర్వహణ కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఫైనాన్స్ కింద రూ. 58,583.61 కోట్లు కేటాయించింది. అదే విధంగా సాధారణ పరిపాలనా వ్యవహారాల కోసం ఈ బడ్జెట్ లో జీఏడీ కి రూ. 998.55 కోట్లు ప్రతిపాదించారు. పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు కేటాయింపుల గురించి ప్రస్తావిస్తూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి బుగ్గన ప్రస్తావన చేసారు. అదే విధంగా ఏపీలో హోంశాఖ 7,586 కోట్లను ఈ బడ్జెట్ లో ఆర్దిక మంత్ిర బుగ్గన ప్రతిపాదించారు.
-
ఈ నెల 13న పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ : ఒకేసారి రూ 6 వేలు..!! -
అమరావతి వేదికగా అరుదైన నిర్మాణం, తెలుగు వైభవాన్ని చాటేలా..!! -
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications