ప్రజలకు నమ్మకం పోతుంది: బుట్టా రేణుక, 'వాజపేయి చేయంది మోడీ చేస్తారని ఆశ'
న్యూఢిల్లీ: తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక శుక్రవారం అన్నారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆమె లోకసభలో మాట్లాడారు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు.
కంప్యూటర్లు చూడాలనుకుంటున్నారు సరే.. అసదుద్దీన్
మీకు కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలా లేక ముస్లీం విముక్త భారత్ కావాలా అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. కాశ్మీర్ పైన మీ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ముస్లీం పిల్లల చేతుల్లో కంప్యూటర్లు చూడాలని ఉందని మోడీ చెబుతారని, కానీ స్కాలర్షిప్లు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

వాజపేయి చేయనిది మీరు చేస్తారని ఆశిస్తున్నా: ఫరూక్
ముస్లీంలపై దాడులు ఆపాలని జమ్ముకాశ్మీర్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మీరు ఎంత భారతీయులో ముస్లీంలు కూడా అంతే భారతీయులు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉత్తర కొరియా, అమెరికాలు చర్చలు జరుపుతున్నాయని, ఇప్పుడు మీకు పూర్తి మెజార్టీ ఉందని, వాజపేయి చేయనిది మీరు చేస్తారని ఆశిస్తున్నానని మోడీని ఉద్దేశించి అన్నారు. సమస్య పరిష్కారానికి మేం మీకు అండగా ఉంటామన్నారు. మనలను ఏ ఇతర దేశమోడో చంపడని, మనల్ని మనమే చంపుకుంటామన్నారు. తాము కాశ్మీరీల గుండెచప్పుడు వినిపిస్తున్నామని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications