హోదా ఎఫెక్ట్.. ఏపీలో ఏం జరుగుతోంది?: బీజేపీ నేతలకు ఢిల్లీ పిలుపు
న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీలో ప్రత్యేక హోదా విషయమై వ్యతిరేకత నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా లేదా ఆ స్థాయిలో ప్యాకేజీ ఇచ్చే దిశలో పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. హోదా ఇవ్వమని బీజేపీ నేతలు, కేంద్రమంత్రుల మాటలను బట్టి ఇప్పటికే అర్థమైంది.
దీని పైన మిత్రపక్షం తెలుగుదేశం, విపక్షాలతో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఆత్మరక్షణలో పడిన బీజేపీ.. ఏపీకి ఏం చేయాలా అనే విషయమై తర్జన భర్జన పడుతోంది. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ కీలక నేతలకు అదిష్టానం నుంచి సమాచారం వచ్చిందని తెలుస్తోంది.

ఢిల్లీ రావాలని, పార్టీ కోర్ కమిటీ భేటీకి హాజరు కావాలని అందులో సూచించారు. ఆహ్వానం అందిన నేతలు ఢిల్లీ ప్రయాణ ఏర్పాట్లలో మునిగిపోయారు. రేపు బీజేపీ కోర్ కమిటీ భేటీ అవుతుంది. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన వ్యవహారంపై కీలక చర్చ జరగనుందని తెలుస్తోంది.
హోదాపై తొందరపడనన్న పవన్ కళ్యాణ్పై రోజా తీవ్రవ్యాఖ్య, అసలేమన్నాడు?ఏపీ ప్రత్యేక హోదాపై ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలపై ఏపీ నేతల నుంచి సమాచారం తీసుకోనున్నారు. ఏపీలో ఏం జరుగుతుందో వివరాలు తెలుసుకోనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఎలా ముందుకెళ్లాలన్న విషయమై చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే, ఏపీ బీజేపీ చీఫ్ పదవిని కూడా ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications