జగన్ కు సీబీఐ భారీ షాక్, ఉల్లంఘన- రద్దు చేయండి..!!
మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ విదేశీ పర్యటన వేళ కోర్టు కొన్ని షరతులు విధించింది. ఈ మేరకు యూరప్ పర్యటనకు అనుమతి లభించింది. జగన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. కాగా, జగన్ కోర్టు షరతుల మేరకు ఇచ్చిన వివరాల పైన సీబీఐ ఇప్పుడు కోర్టులో తాజా పిటీషన్ దాఖలు చేసింది. షరతుల ఉల్లంఘన జరిగిందని.. అనుమతి రద్దు చేయాలని కోరింది.
మాజీ ముఖ్యమంత్రి యూరప్ పర్యటనకు అనుమతి వేళ సీబీఐ కోర్టు తన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులు విధిస్తూ అనుమతి మంజూరు చేసింది. కాగా, ఇప్పుడు సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ సంచలనంగా మారుతోంది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్కు బదులు.. మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సీబీఐ స్పష్టం చేసింది. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదికి సీబీఐ కోర్టు ఆదేశించింది.

జగన్ తన కుమార్తెల వద్దకు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇందు కోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు. జగన్ పిటీషన్ పైన విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో... పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో.. ఈ నెల 11వ తేదీన జగన్ యూరప్ వెళ్లారు. పర్యటన అనుమతి సమయంలోనూ కోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొనగా... సీబీఐ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. దీంతో.. కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. ఇప్పుడు సీబీఐ తాజా పిటీషన్ .. కౌంటర్పై సీబీఐ కోర్టు ఈ రోజు అంటే.. గురువారం విచారణ చేపట్టనుంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications