కాకినాడ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..! ఆ రెండు రైళ్ల సమయాల్లో..!
కాకినాడ ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ నుంచి సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణించే రెండు రైళ్ల రాకపోకల్లో రేపు ఒక్కరోజు మార్పులు చోటు చేసుకోనున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో జరుగుతున్న మెయింటెనెన్స్ పనుల కారణంగా వందే భారత్ లతో పాటు పలు రైళ్ల సమయాల మార్పు, మళ్లింపులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో కాకినాడ నుంచి రాకపోకలు సాగించే రెండు రైళ్లు కూడా ఉన్నాయి.
కాకినాడ నుంచి ముంబై లోక్ మాన్య తిలక్ టెర్మినల్ కు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17221తో పాటు లోక్ మాన్య తిలక్ టెర్మినల్ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17222 రాకపోకల్లో రేపు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే కచ్చితంగా ఎంత సమయం లేట్ అవుతుందో తెలియకపోయినా ఈ రెండు రైళ్లలో ప్రయాణికులకు ఆలస్యం మాత్రం తప్పేలా లేదు. రెండు వైపులా వెళ్లే ట్రైన్లు మధ్యలో మళ్లింపులు చేపడుతున్నారు. దీంతో ఈ ఆలస్యం జరిగే అవకాశం ఉంది.

సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న సీఎస్ఎంటీ నుంచి చునాభట్టీ, బాంద్రా డీఎన్ హార్బర్ లైన్ లో ప్రయాణించే రైళ్లకు ఉదయం 11.40 నుంచి సాయంత్రం 4.40 వరకూ బ్లాక్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే చునాభట్టీ-బాంద్రా నుంచి సీఎస్ఎంటీ లైన్ కు ఉదయం 11.10 నుంచి సాయంత్రం 4.10 వరకూ బ్లాక్ ఉంటుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ మార్గంలో వెళ్లే రైళ్ల సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ రైళ్లలో ప్రయాణించే వారు రైల్వే యాప్ లేదా వెబ్ సైట్ లో లైవ్ సమయాలను చూసుకుని ప్రయాణాలు సాగించాల్సి వస్తుంది.

ముంబై డివిజన్ ఆదివారం అనగా 19.10.2025 నాడు వివిధ ఇంజనీరింగ్ మరియు నిర్వహణ పనులను నిర్వహించడానికి విద్యావిహార్ మరియు థానే స్టేషన్ల మధ్య 5వ మరియు 6వ లైన్లలో దాని ప్రధాన లైన్ సబర్బన్ విభాగాలలో మెగా బ్లాక్ను చేపడుతుందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ నీలా తెలిపారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications