పుట్టమన్నుకు బాబు పూజలు, నిమ్మకూరులో లోకేష్: 'అమరావతి'పై సింగపూర్ ఆరా
చిత్తూరు: జిల్లాలోని నారావారిపల్లెలో నిర్వహించిన మన మట్టి - మన నీరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం స్వగ్రామంలో పుట్ట మట్టి సేకరించి ప్రత్యేక పూజలు చేశారు.

అమరావతి విజయవంతం కావాలని నారావారిపల్లెలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అందరి సంకల్పంతో రాజధాని నిర్మాణం కావాలన్నారు. పదహారువేల గ్రామాల్లో మన నీరు - మన మట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని అమరావతి రాజధానిగా నిర్ణయించామన్నారు. అమరావతి దేవేంద్రుడి రాజధాని అని చెప్పారు. తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు చాటి చెప్పేలా అమరావతి నిర్మాణం చేపడతామన్నారు. అమరావతికి స్థాన, వాస్తు బలం ఉందన్నారు.
రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని ఉంటుందన్నారు. పవిత్ర భావనతో, అందరి మనోభావాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు అన్నారు. అదే సంకల్పంతో రాజధాని కట్టుకోవాలన్నారు.

జీవితంలో ఒకేసారి వచ్చే పండుగ అమరావతి నిర్మాణం అన్నారు. అమరావతికి చరిత్ర ఉందని, ఇది బుద్ధుడు నడయాడిన నేల అన్నారు. దేవేంద్రుడి రాజధాని అన్నారు. తెలుగువారి కీర్తి, ప్రతిష్టలు పెంచేలా అమరావతి రాజధాని నిర్మిస్తామన్నారు. రాజధాని నిర్మాణం 5 కోట్ల ప్రజలకు సంబంధించినదన్నారు.
రాజధాని నిర్మాణంలో జపాన్, సింగపూర్ దేశాల సహాయం తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తామని చెప్పారు.

కాగా, చంద్రబాబు నారావారిపల్లి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రుల సమాధులను దర్శించుకున్నారు. అనంతరం మట్టిని సేకరించారు. చంద్రబాబు సర్వమత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు, నిమ్మకూరులో మన మట్టి - మన నీరు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని కుమ్మరితోవ తపోవనంలో పుట్టమట్టి, పాండవ నది నుంచి పుణ్య జలాలను ఆర్థిక శాఖ యనమల రామకృష్ణుడు సేకరించారు. అన్నవరంలోని పంపానది నుంచి పుణ్య జలాలను టిడిపి జిల్లా అధ్యక్షులు సేకరించారు.

'అమరావతి'పై సింగపూర్ ఆరా
రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై సింగపూర్ ప్రతినిధులు ఆరా తీశారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ రాయ్ కో ఉద్దండరాయునిపాలెంలో సభా ప్రాంగణంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
హెలీప్యాడ్ స్థలాన్ని అక్కడి నుంచి వేదికకు వచ్చే రోడ్డు మార్గాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ నెల 18 నుంచి భద్రతా ఏర్పాట్లు చేస్తామని, ఎస్పీజీ దళాల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను చేపట్టనున్నామన్నారు. రాయ్ కోకు.. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీయే అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!?











Click it and Unblock the Notifications