కలిసే వెళ్తాం: బిజెపితో పొత్తుపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు చెప్పారట. కొంతకాలంగా టిడిపి, బిజెపిపై పొత్తుపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు పొత్తుపై సంకేతాలు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. గురువారం పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేల సమావేశంలో వివిధ అంశాలపై మాట్లాడుతూ బిజెపి ప్రస్తావన తెచ్చారట.

వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తుంటుందని, కలిసి పోటీ చేస్తామని, మనం కూడా కొన్ని చోట్ల వారిని సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, బిజెపి నేతలతో కలిసి పని చేయడానికి ఇప్పటి నుంచే ప్రాధాన్యమివ్వాలని సూచించారట. స్థానికంగా ఏవైనా కార్యక్రమాలు ఉంటే వారిని కలుపుకొని వెళ్లాలని, ఉభయ పార్టీల శ్రేణుల మధ్య సంబంధాలు పెంచడానికి ప్రయత్నం చేయాలని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలకు రావాలని బిజెపి జాతీయ నాయకత్వం తనను కోరుతోందన్నారు.

తాను కూడా వారి కోసం కొంత సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారని తెలుస్తోంది. సీమాంధ్రలో చాలామంది నాయకులు టిడిపిలోకి వస్తామంటున్నారని, వారిలో ఎవరి అవసరముందో చూసి నిర్ణయం తీసుకుందామన్నారు. ప్రతి జిల్లా నుంచి చాలామంది పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని, వస్తామన్న వారినందరినీ తీసుకోవడం కాకుండా మనకు ఎక్కడ అవసరం ఉందో ఎవరి అవసరం ఉందో దాన్ని బట్టి తీసుకుందామని సూచనలు చేశారట.

పార్టీకి ఉపయోగపడేవారు వస్తామన్నప్పుడు అందరూ ఆహ్వానించాలని, ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తనతో చెప్పాలని, మాట్లాడుతానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందామని సూచించారట. పల్లె పల్లెకూ తెలుగుదేశం కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో అనుకొన్న స్థాయిలో నిర్వహించాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+