చంద్రబాబుకు బయటపడరు: ప్రత్యేక హోదాపై మరోసారి బాంబు పేల్చిన జెసి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మరోసారి బాంబు పేల్చారు. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందో రాదో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలుసునని ఆయన అన్నారు.
విషయం తెలిసినప్పటికీ చంద్రబాబు బయటపడే వ్యక్తి కారని జెసి అన్నారు. ప్రత్యేక హోదాపై ఆ మధ్య కాలంలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకు తెలుసునని ఆయన అన్నారు.
కేంద్రానికి చులకన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే కేంద్ర ప్రభుత్వానికి చులకనగా ఉందని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ప్రెసిడెంట్ చలసాని గాంధీ విమర్శించారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖకు రైల్వే జోన్ రావడం లేదన్న వార్తను తాను ఏబీఎన్ చానల్లో చూశానన్నారు.
గత ఎన్నికల సందర్బంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు రైల్వేజోన్ ఏర్పాటుపై ఎన్నో హామీలిచ్చారని, ఇప్పుడు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పార్లమెంటు సభ్యుడు హరిబాబు రైల్వే జోన్పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.