రెచ్చగొట్టాలని చూస్తారు, వైసిపితో జాగ్రత్త: ఎమ్మెల్యేలతో చంద్రబాబు
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభలో రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సూచించారు. తాము కష్టపడి పనిచేస్తున్నామనిస ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చెప్పటానికి సమాధానం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు.
తాము ప్రతిపక్షం కోసం కాకుండా ప్రజలకు వాస్తవాలు వివరించటానికి శాసనసభా సమావేశాలను వినియోగించుకోవాలని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు సంసిద్ధం కావాలని, సంయమనం పాటించాలని అని చంద్రబాబు వారికి చెప్పారు. సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సకాలంలో హాజరు కావాలని ఆయన అన్నారు.

అన్ని అంశాలపై ముందుగా కసరత్తు చేసుకుని రావాలని ఆయన ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరు కొత్త బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అవినీతిపరుల అక్రమాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందేలా చట్టసవరణ బిల్లు ఇందులో ముఖ్యమైందని అన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించే బిల్లు, సాగునీటి సంఘాలకు ఎన్నికలు కాకుండా ఏకాభిప్రాయంతో కార్యవర్గాలను ఎంపిక చేయటానికి ఉద్దేశించిన బిల్లు, ఈ-ట్రేడింగ్కు అనుమతించే బిల్లులు ఇందులో ఉన్నాయి.
-
కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications