తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు స్మగ్లర్ అవుతారా: స్మగ్లర్లతో జగన్ నేత ములాకత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chevireddy counters to Chandrababu Naidu
రాజమండ్రి: చంద్రగిరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలతో ములాఖత్ అయ్యారు. ఎర్రచందనం కేసులో అరెస్టైన ఖైదీలను చెవిరెడ్డి కలిశారు. అయితే, ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ నిందితులను కలవడాన్ని చెవిరెడ్డి సమర్థించుకున్నారట.

కేవలం కక్ష సాధింపుతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజకీయ కక్షతోనే తన వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తాను ఎర్రచందనం స్మగ్లర్లను కలవలేదని విజయానంద రెడ్డి అనే తమ పార్టీ కార్యకర్తను కలిశానని చెవిరెడ్డి చెప్పారట. తప్పు ఎవరిదైనా శిక్షించాల్సిందేనని అన్నారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా భావించి టిడిపి అణగదొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. గంగాధర నెల్లూరుకు చెందిన పార్టీ కార్యకర్త విజయానంద రెడ్డి పైన రాజకీయ కోణంలోనే స్మగ్లర్ అని కేసు పెట్టారని ఆరోపించారు.

రాజమండ్రి జైలులో ఉన్న విజయానంద రెడ్డిని పరామర్శించడం తన బాధ్యత అనుకున్నానని చెప్పారు. దీనిపై కొందరు రకరకాల ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తానెప్పుడు ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరించలేదన్నారు. అసలైన నేరస్తులను శిక్షిస్తే తాను సమర్థిస్తానన్నారు. కడపలో పీడీ యాక్టు కింద అరెస్టైన ఇద్దరికి చంద్రబాబు బీఫారం ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అంతమాత్రాన బాబు స్మగ్లర్ అవుతారా అన్నారు.

English summary
YSR Congress Party leader Chevireddy counters to Chandrababu Naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X