‘నాయకుడంటే ఇలా.. చినరాజప్ప రాజీనామాకు సిద్ధపడితే, బాబు వారించారు’
హైదరాబాద్/తూర్పుగోదావరి: రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం చినరాజప్ప రాజీనామా చేసేందుకు సిద్ధపడితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. ఆయన శనివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు.
సంక్షోభం వచ్చినప్పుడు నాయకత్వం ఎలా ఉండాలో చంద్రబాబు పుష్కరాల సమయంలో చూపించారని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ప్రశంసించారు. ‘పుష్కరాల తొలిరోజే తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత హోం శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం రాజప్ప.. సంఘటనకు బాధ్యత తీసుకొని తాను రాజీనామా చేస్తానన్నారు' అని చెప్పారు.

చంద్రబాబు ఆయనను వారించి, స్వయంగా ప్రజల ముందుకు వచ్చి జరిగిన సంఘటనకు బాధ్యత తనదని.. తనను క్షమించాలని కోరారని మురళీ మోహన్ చెప్పారు.
ఏదైనా సంఘటన జరిగితే ఎవరో ఒకరిపై తోసేసి వారిని బలి చేసే రోజులో.. చంద్రబాబు ఆ పని చేయకుండా బాధ్యత తన నెత్తిపై వేసుకొన్నారని తెలిపారు. నాయకుడు ఎలా ఉండాలో మాకు ఆ సంఘటన నేర్పిందని వివరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications