TTD: గత ఆరు నెలల్లో రూ 100 కోట్లు మింగేశారు, కేంద్ర మాజీ మంత్రి చింతా
టీటీడీలో గత పాలకమండలి అధికారంలో ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో గత ఆరు నెలల కాలంలో సుమారు రూ. 100 కోట్లకు పైగా చేతులు మారాయని, వాటిపైన విచారణ జరిపించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేశారు.
ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గత వైసీపీ ప్రభుత్వంపై, గత టీటీడీ పాలక మండలిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను గత టీటీడీ పాలక మండలి దుర్వినియోగం చేసిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు, గత పాలకమండలి టీటీడీ సత్రాలు నిర్మించడానికి రూ. 1200 కోట్లు కాంట్రాక్టు ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని చింతా మోహన్ గుర్తు చేశారు.

ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చారని, అందులో రూ. 100 కోట్లకు పైగా చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. దేవుడి మీద భక్తితో తిరుమలకు చేరుకున్న భక్తులు శ్రీవారి హుండీలో కానుకలు సమర్పిస్తారని, ఆ హుండీ డబ్బులను గత పాలకమండలి దుర్వినియోగం చేసిందని, ప్రజల మనోభావాలతో పడుకున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గత టీటీడీ పాలక మండలి తీరుప మండిపడ్డారు.

తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను గత వైసీపీ ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి అపవిత్రం చేసిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్నిప్రమాదంపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆంధ్రప్రదేశ్ప్రభుత్వానికి మనవి చేశారు.
-
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
దర్శనం, టోకెన్ల జారీ, క్యూ లైన్లలో టీటీడీ కీలక మార్పులు- ఈ తేదీ నుంచి అమలు..!! -
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం












Click it and Unblock the Notifications