లంచాలిస్తే ఏమైనా చేసుకోవచ్చు: అధికారులపై చింతమనేని సంచలనం
ఏలూరు: కోమటిలంకకు రోడ్డు వేయడం నేరం కాదని, పాత రోడ్డుపై గ్రావెల్ మాత్రమే పోశామని ప్రభుత్వ ఛీప్ విప్, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
మూడో కాంటూరుకు తగ్గించాలనే డిమాండ్ ఉందని, ఆ హామీని నెరవేర్చి తీరుతామని ఆయన అన్నారు. అధికారులకు లంచాలు ఇస్తే, రోడ్లు వేసుకోవచ్చు, బంగళాలు కట్టుకోవచ్చు, లేదంటే నిబంధనల పేరుతో అడ్డుకుంటారని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
చింతమనేని ప్రభాకర్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటివానిలంకకు శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు నిర్మాణాన్ని జరిపించిన సంఘటన నేపథ్యంలో ఆ కేసులు నమోదయ్యాయి.

అంతేగాక ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోగా పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారు. దీంతో ఆగ్రహించిన అటవీ సిబ్బంది పోలీస్స్టేషన్ వద్ద ధర్నా చేయాలని కూడా నిర్ణయించారు.
దీంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యం చేసినందుకుగానూ 353, 447 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications