మొయిలీకి చిరంజీవి ప్రచారం: సీమాంధ్ర జాబితా రెడీ

 Chiranjeevi to compaign for Moily
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథి చిరంజీవి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14న చిక్కబళ్లాపుర రోడ్ షోలో పాల్గొంటారు. కేంద్రమంత్రి వీరప్పమొయిలీకి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. చిక్కబళ్లాపుర పరిధిలో సుమారు 3 గంటలపాటు రోడ్‌షోలో పాల్గొంటారని స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ సుధాకర్ గురువారం ప్రకటించారు.

చిరంజీవిని చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలి వస్తారని భావించి అదనపు పోలీసు బలగాలను కోరినట్లు తెలిపారు. చిక్కబళ్లాపుర జిల్లాలో తెలుగువారు అధికంగా ఉన్నందున ఆయన అక్కడ పర్యటించనున్నారు.

అధిష్టానం పెద్దలతో సమావేశం తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేసుకున్నారు. గురువారం చిరంజీవి నివాసంలో సమావేశమైన రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలు సీమాంధ్ర అభ్యర్థుల జాబితాపై కసరత్తులు పూర్తి చేశారు. ఈ జాబితాను అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళనున్నారు.

సీమాంధ్రకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తయిందని, ఇంకా 20, 30 స్థానాలకు సంబంధించి పరిశీలించాల్సి ఉందని, తొలి దశలో వంద మంది అభ్యర్థుల జబితాను విడుదల చేస్తారని తెలియవచ్చింది. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కూడా గురువారంనాడు చర్చలు జరినట్లుగా సమాచారం.

అధిష్టానంతో చర్చించిన అనంతరం ఒకటి, రెండు రోజుల్లో మేనిఫెస్లోను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. ఈనెల 17న సీమాంధ్రలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చలు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+