సంక్రాంతి తర్వాత పునర్వ్యస్తీకరణ: సిడబ్ల్యుసిలోకి చిరంజీవి, కెవిపి కూడా?
న్యూఢిల్లీ: పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లోకి రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ), సీడబ్ల్యూసీలను పునరుద్ధరించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత పార్టీ అత్యున్నత వేదికలైన సీడబ్ల్యూసీ, ఏఐసీసీ నియామకాలు జరుగుతాయంటూ వార్తలు వస్తున్నాయి.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో కె.కేశవరావు సీడబ్ల్యూసీకి ప్రాతినిధ్యం వహించారు. అనుబంధ సభ్యుడిగా సంజీవరెడ్డి కూడా ఉండేవారు. ఆ తర్వాత కావూరి సాంబశివరావుకు సిడబ్ల్యుసిలో స్థానం కల్పించారు. అయితే దాన్ని ఆయన తిరస్కరించారు. రాష్ట్ర విభజన తర్వాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో చిరంజీవిని సిడబ్ల్యుసిలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో లోక్సభ, శాసనసభల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దీంతో పార్టీ పునరుజ్జీవానికి సీడబ్ల్యూసీ, ఏఐసీసీల్లో వీలైనన్ని ఎక్కువ పదవులను ఏపీకి ఇవ్వాలని అధిష్ఠానం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ వ్యవహారాల్లో చిరంజీవి పెద్దగా జోక్యం చేసుకోవటం లేదని అంటున్నారు.
ఏపీలో పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆయన హాజరు కావటం లేదని తెలిసింది. పీసీసీ ఆహ్వానిస్తున్నప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు సమాచారం. నిరుడు పుణెలోని ఎఫ్టీఐఐలో ధర్నా చేస్తున్న విద్యార్థుల్ని కలిసి మద్దతు తెలిపేందుకు వెళ్లాలని నిర్ణయించిన రాహుల్ స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి ఆయన్ను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
ఇదిలావుండగా, సీడబ్ల్యూసీ సభ్యత్వానికి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పేరు కూడా అధిష్ఠానం పరిశీలనలో ఉంది. అయితే, పార్టీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీడబ్ల్యూసీ సభ్యత్వం చిరంజీవికి ఇవ్వటమే ఉత్తమమని అధిష్ఠానం పెద్దలకు కెవిపి చెప్పినట్లు తెలిసింది. కాపు సామాజిక వర్గాన్ని తిరిగి చేరువ చేసుకోవడానికి చిరంజీవి ప్రాతినిధ్యం పనికి వస్తుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications