వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకి ఆఖరిపోరాటం, జగన్‌కోసం వస్తే షాకయ్యా: చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు ప్రచార సారథి చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. చిరంజీవి ప్రముఖ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు.

ఈ సార్వత్రిక ఎన్నికలు జగన్‌కు రక్షణ పోరాటం అయితే, చంద్రబాబుకు ఆఖరి పోరాటమని ఎద్దేవా చేశారు. ఈసారి ఓడిపోతే మరెప్పుడూ ముఖ్యమంత్రిని కాలేనని చంద్రబాబు పోరాడుతున్నారన్నారు. అలాగే జగన్ తన అక్రమ సంపాదనను రక్షించుకునేందుకు, తనపైనున్న కేసుల నుంచి రక్షణ పొందాలని, తన అవినీతి నుంచి రక్షణ పొందడానికి రక్షణ పోరాటం చేస్తున్నారన్నారు.

Chiranjeevi on Chandrababu and YS Jagan

వైయస్ మరణించి 24 గంటలు గడవక ముందే ఆయన అంతిమ సంస్కారం జరగకుండానే తక్షణం ముఖ్యమంత్రిగా జగన్‌ను చేద్దామంటూ 20 మంది ఎమ్మెల్యేలు తన మద్దతు కోరారని చెప్పారు.

తాను పిఆర్పీ నేతగా, ప్రతపక్ష నేతగా షాక్‌కు గురై ఉన్నానని, వారి వాదనతో మరింత దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలతో పదవుల పంపకానికి ఇది సరైన సమయం కాదని చెప్పానని, అయినా ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు అధిష్ఠానం ఉందని, అది నిర్ణయిస్తుందని చెప్పానట్లు తెలిపారు.

English summary
Union Tourism Minister Chiranjeevi on Chandrababu and YS Jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X