కుప్పం, పుంగనూరులో ఆపనులు చెయ్యండి, ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లా చిత్తూరు పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పరిధిలోని కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువలకు సాగు నీరు రావడం లేదు. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులు పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వగా అందులో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పుంగనూరు బ్రాంచ్ కాలువకు త్వరలోనే సాగు నీరు అందుతుందని తెలిసింది. 2014- 19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. కర్నూలు జిల్లా నుండి ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదననల్లె, పుంగనూరు, పలమనేరు ప్రాంతాలకు సాగునీరు అందించడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హంద్రీ నీవా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామకుప్పం వరకు కొంత నీళ్లు తీసుకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం హడావిడి చేసి సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే పుంగనూరు బ్రాంచ్ కాలంలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని సంబంధిత అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ఇక తంబళ్లపల్లె నియోజకవర్గం లో బ్రాంచ్ కాలువ పలుచోట్ల పూర్తిగా దెబ్బతినిందని అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఈ పనులు త్వరగా పూర్తి చేయాలంటే దాదాపు రూ. వంద కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సంబంధిత అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులకు ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, నియోజకవర్గాల్లో దాదాపు 37 వేల ఎకరాలకు ఆయకట్టు నీరు అందుతుందని అధికారులు అంటున్నారు.

ఇక కుప్పం బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాల్లో పనులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు అంటున్నారు. కుప్పంలో కాలువ పనులకు భూములు ఇచ్చిన రైతులకు రూ. 17 కోట్లు బకాయిలు ఇవ్వాలని, హంద్రీ నీవా కాలువు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సుమారు రూ. 29 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు పూర్తయి అయితే 110 చెరువులకు సాగు నీరు అందుతుంది. పుంగనూరు కుప్పం బ్రాంచ్ కాలవ పనులు పూర్తి అయితే కృష్ణా జలాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తాయని, సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు నాలుగు లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుందని, కాలువ పనులు వేగవంతం చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications