టార్గెట్ జగన్..వైసీపీ అవినీతిపై చంద్రబాబు కీలక నిర్ణయం..?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. చంద్రబాబు తొలి కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా జగన్ టార్గెట్గానే ఈ కేబినెట్ సమావేశం జరిగిందని ని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. దీనికి అనుగుణంగా ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి 14 లక్షల కోట్లకు పైగానే అప్పుల భారం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ అప్పులను ఎలా తెచ్చారు.. ఎలా ఖర్చు పెట్టారు.. ఆ నిధులన్నీ ఏమైపోయాయన్న దానిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించారని సమాచారం.

లబ్ధిదారుల అకౌంట్ల్లో చేసిన పథకాలు మినహాయించి మిగిలిన నిధులను ఎలా ఖర్చు చేశారనే దానిపై లెక్కలు బయటకు తీయనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్ గోల్మాల్పై విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వసం జరిగిందని టీడీపీ, జనసేన నేతలు పదేపదే అంటున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ విధానాలపైనా చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వ చేసిన అవినీతిపై విచారణ చేపట్టే అంశంపైనా కీలక చర్చ జరగినట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ టార్గెట్గా చంద్రబాబు తన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారనే సమాచారం అందుతోంది.
-
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఓ వైపు యుద్ధం.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే.. -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు












Click it and Unblock the Notifications