ముంపు గ్రామాల పర్యటనకు జగన్- ఆ మండలంలో బాధితులతో భేటీ
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలను అతి భారీ వణికించాయి. అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడ్డాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుసిన వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తింది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం దాదాపుగా 48 అడుగులుగా నమోదైంది.
గోదావరి పరీవాహక ప్రాంతం, రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అనేక ఏజెన్సీ గ్రామాలు నీట మునిగాయి. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, కూనవరం.. వంటి మండలాలకు వెళ్లే రహదారులపై వరదనీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో భారీగా పెరగడం వల్ల లక్షల క్యూసెక్కులకు వరదనీటిని దిగువకు వదిలివేశారు అధికారులు.

గోదావరి నదికి పోటెత్తిన వరద ప్రభావం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాలపై పడింది. ఆయా మండలాల పరిధిలో ఉన్న 458 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పలు లంక గ్రామల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. వరద బాధితులను ముఖాముఖిగా కలుసుకోనున్నారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలాన్ని ఆయన సందర్శించనున్నారు. ఈ మండలం పరిధిలోని గ్రామాల ప్రజలను జగన్ నేరుగా కలుసుకుని అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్యమంత్రి వెంట రానున్నారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లు ఆయన వెంట ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
-
అక్కడ మంచు కరిగితే.. ఇక్కడ వర్షాలు ఎందుకు పెరుగుతున్నాయి? -
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications