ఒకేరోజు అటు కడప..ఇటు విశాఖ: వైఎస్ జగన్ బిజీ షెడ్యూల్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవ్వాళ ఒకేరోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తన సొంత జిల్లా కడపతో పాటు విశాఖపట్నానికి ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం కడప.. సాయంత్రం విశాఖపట్నంలో వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ రోజంతా ఈ రెండు జిల్లాల పర్యటనతో గడపనున్నారు. ఈ సాయంత్రం విశాఖపట్నానికి రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు.
ఈ ఉదయం ఆయన కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఉదయం 9:30 గంటలకు వైఎస్ జగన్- తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. 9:50 నిమిషాలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరుతారు. 10.45 నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
11 గంటలకు కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రిమ్స్కు చేరుకుంటారు. 11:105 నిమిషాలకు రిమ్స్ నుంచి రింగ్ రోడ్లో గల పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్కు చేరుకుంటారు. ఈ ఇన్స్టిట్యూట్ను ప్రారంభిస్తారు. 11:40 నిమిషాల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం పుష్పగిరి ఇన్స్టిట్యూట్ నుంచి బయలుదేరి జయరాజ్ గార్డెన్స్కు చేరుకుంటారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కుమార్తె వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:10కి మళ్లీ తాడేపల్లికి తిరుగుప్రయాణం అవుతారు. 1:40 నిమిషాలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
Recommended Video
మళ్లీ మధ్యాహ్నం 3:40 నిమిషాలకు ఆయన విశాఖ పర్యటన ఆరంభమౌతుంది. సాయంత్రం 4:50 నిమిషాలకు వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. వీవీఐపీ లాంజ్లో పార్టీ నాయకులతో కొద్దిసేపు సమావేశమౌతారు. 5 గంటలకు నావల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుంటారు. 5:20 నిమిషాలకు విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆయన స్వాగతం పలుకుతారు. 5:30 నిమిషాలకు మళ్లీ ఎయిర్పోర్ట్కు చేరుకుని, తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.