విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకేరోజు అటు కడప..ఇటు విశాఖ: వైఎస్ జగన్ బిజీ షెడ్యూల్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవ్వాళ ఒకేరోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తన సొంత జిల్లా కడపతో పాటు విశాఖపట్నానికి ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం కడప.. సాయంత్రం విశాఖపట్నంలో వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ రోజంతా ఈ రెండు జిల్లాల పర్యటనతో గడపనున్నారు. ఈ సాయంత్రం విశాఖపట్నానికి రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు.

ఈ ఉదయం ఆయన కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఉదయం 9:30 గంటలకు వైఎస్ జగన్- తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. 9:50 నిమిషాలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరుతారు. 10.45 నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.

CM YS Jagan will visit the Kadapa and Visakhapatnam today

11 గంటలకు కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో రిమ్స్‌కు చేరుకుంటారు. 11:105 నిమిషాలకు రిమ్స్ నుంచి రింగ్ రోడ్‌లో గల పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుంటారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. 11:40 నిమిషాల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం పుష్పగిరి ఇన్‌స్టిట్యూట్ నుంచి బయలుదేరి జయరాజ్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కుమార్తె వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:10కి మళ్లీ తాడేపల్లికి తిరుగుప్రయాణం అవుతారు. 1:40 నిమిషాలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

Recommended Video

Andhra Pradesh: Ugadi నుంచి New Districts,Vizag నుంచి పరిపాలన | AP 3 Capitals | Oneindia Telugu

మళ్లీ మధ్యాహ్నం 3:40 నిమిషాలకు ఆయన విశాఖ పర్యటన ఆరంభమౌతుంది. సాయంత్రం 4:50 నిమిషాలకు వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. వీవీఐపీ లాంజ్‌లో పార్టీ నాయకులతో కొద్దిసేపు సమావేశమౌతారు. 5 గంటలకు నావల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుంటారు. 5:20 నిమిషాలకు విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన స్వాగతం పలుకుతారు. 5:30 నిమిషాలకు మళ్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy will visit the Kadapa district and Visakhapatnam today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X