చిరంజీవి ప్రజారాజ్యంపై కమెడియన్ సునీల్ షాకింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.
సినిమాల్లో వచ్చిన క్రేజ్తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చాలామంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వడాన్ని కళ్లరా చూసి కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.

ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఓ చోట ఓడిపోయి, మరో స్థానంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో చిరంజీవి ఓడిపోవడం ఆయనకు మాయని మచ్చలా నిలిచింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ చరిష్మా ముందు చిరంజీవి నిలబడలేకపోయారు. వైఎస్ఆర్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది.
వైఎస్ఆర్ హఠాత్తు మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీను ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో చిరంజీవి ఓ ఫెయిల్యుర్ పొలిటిషియన్గా నిలిచారు. తాజాగా కమెడియన్ సునీల్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఫెయిల్ అయిందో వివరించే ప్రయత్నం చేశారు.
చిరంజీవి గారు సినిమాల్లో తన సొంత టాలెంట్తో టాప్ హీరోగా ఎదిగారని..కానీ రాజకీయాల్లో అలా కాదని సునీల్ చెప్పుకొచ్చారు. రాజకీయంగా సక్సెస్ కావాలంటే చాలా అంశాలు, చాలా మంది వ్యక్తుల పై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయాల్లో ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒక్కరు రాంగ్ స్టెప్ వేసినా చాలు అంతా.. నాశనం అవుతుందని సునీల్ తెలిపారు. ఆ విధంగా చిరంజీవి చుట్టూ ఉన్నవారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రజారాజ్యం ఫెయిల్ అందని సునీల్ చెప్పుకొచ్చారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications