Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్క టిక్కెట్.. 2 ఎన్నికలు: సీమాంధ్రలో కాంగ్రెస్ ఆఫర్!

 Congress
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి రానున్న ఎన్నికల కోసం అభ్యర్థులు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఒక్క టిక్కెట్ రెండు ఎన్నికల' వ్యూహానికి తెరలేపిందంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే వారికి 2019 ఎన్నికల్లోను టిక్కెట్లు ఇస్తామని చెబుతున్నారట. విభజన నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు.. చేరుతున్నారు.

కాంగ్రెసు పార్టీకి సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి సీమాంధ్రలో కనిపిస్తోంది. సీనియర్లు చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్లినందున.. కొత్త వారి కోసం కాంగ్రెసు వెతుకుతోంది. అయితే, కొత్తగా పోటీ చేద్దామనుకునే ద్వితీయశ్రేణి నాయకుల్లో అనుమానాలు ఉన్నాయట. ఇప్పుడు తాము పోటీ చేస్తున్నప్పటికీ పార్టీ క్రమంగా బలం పుంజుకుంటే... పాతవారు తిరిగి పార్టీలోకి వస్తే తమను పక్కన పెట్టే అవకాశముందని అనుమానిస్తున్నారట. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసే వారికే 2019 ఎన్నికల్లోను సీట్లు ఇస్తామని కాంగ్రెసు హామీ ఇస్తోందట.

సీమాంధ్రలో కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స చేసేందుకు ఆ ప్రాంత ముఖ్య నాయకులు నడుం బిగించిన విషయం తెలిసిందే. వలసల నివారణకు, పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సోమవారం ఆంధ్ర (సీమాంధ్ర) ప్రాంత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి చిరంజీవి, పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, వట్టి వసంత్ కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పార్టీకి జరిగిన నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారు ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగానే తొలుత సీమాంధ్రలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీ నుంచి బస్సు యాత్రను శ్రీకాకుళం నుంచి ప్రారంభించాలని వారు సూత్రప్రాయంగా నిర్ణయించారు. యాత్రను ప్రతి రోజూ రెండు జిల్లాల్లో నిర్వహిస్తూ అనంతపురంలో ముగించాలని వారు భావించారు.

బస్సు యాత్ర నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించాలని, పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరూ ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుందని వారు భావించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీనే దోషిగా నిలబెడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని వారు నిర్ణయించారు. రాష్ట్ర విభజనకు తమకు అభ్యంతరం లేదని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం విభజన చేయవచ్చని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు బహిరంగంగా ప్రకటించిందని ప్రజలకు తెలియజేయాలని వారు భావించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+