కాంగ్లో కోవర్టులు, జానా పట్టించుకోవట్లేదు: కోమటిరెడ్డి
తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో వస్తేనే వచ్చినట్లు అన్నారు. సమైక్యంపై కిరణ్, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ వంటి వారు గట్టిగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డికి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తెలంగాణ అంశం పక్కనబెట్టి కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పదవుల కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సర్వే చేయిస్తున్నారని, తెలంగాణ పిసిసి పదవి తనకే వస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీతో తమకు లింకు కలవదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేరుగా అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ సమైక్యవాదం వినిపిస్తూ తమతో పొత్తు అంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో తమను కన్విన్స్ చేస్తే పొత్తు ఉంటుందన్నారు.
పార్టీని వీడను
కాంగ్రెస్ పార్టీలోనే తాను ఎదిగానని, ఎవరు పార్టీ పెట్టినా కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదని మంత్రి మహీధర్ రెడ్డి స్పష్టం చేశారు. విప్ ఉండదు కాబట్టి తమ అభిప్రాయాలు చెబుతామన్నారు.