వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్‌లో కోవర్టులు, జానా పట్టించుకోవట్లేదు: కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లోనే కోవర్టులు ఉన్నారని మాజీ మంత్రి, నల్గొండ జిల్లా కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం అన్నారు. ఉదయం అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కొందరు తెలంగాణ నేతలు కలవమెందుకన్నారు.

తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో వస్తేనే వచ్చినట్లు అన్నారు. సమైక్యంపై కిరణ్, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ వంటి వారు గట్టిగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డికి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తెలంగాణ అంశం పక్కనబెట్టి కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పదవుల కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సర్వే చేయిస్తున్నారని, తెలంగాణ పిసిసి పదవి తనకే వస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీతో తమకు లింకు కలవదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేరుగా అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ సమైక్యవాదం వినిపిస్తూ తమతో పొత్తు అంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో తమను కన్విన్స్ చేస్తే పొత్తు ఉంటుందన్నారు.

పార్టీని వీడను

కాంగ్రెస్ పార్టీలోనే తాను ఎదిగానని, ఎవరు పార్టీ పెట్టినా కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని మంత్రి మహీధర్ రెడ్డి స్పష్టం చేశారు. విప్ ఉండదు కాబట్టి తమ అభిప్రాయాలు చెబుతామన్నారు.

English summary
Former minister and Congress MLA Komatireddy Venkat Reddy on Thursday said coverts in Telangana Congress leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X