హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవర్ కట్: క్యాండిల్ లైట్‌లో మహిళా పోలీసు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోంది. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్యవాదులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, ఆందోళనలతో దద్దరిల్లుతోంది. ఐదు రోజులుగా ఉద్రిక్తంగా ఉన్న విజయనగరం క్రమంగా కోలుకుంటోంది. ఈరోజు కొద్ది గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సడలించనున్నట్లు చెప్పారు. మరోవైపు విజయనగరం జిల్లా ఘటనకు స్బందించి ముగ్గురు సిఐలను సస్పెండ్ చేశారు.

విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో గత నాలుగు రోజులుగా విద్య, వైద్యం, తాగునీటి రంగాలపై పెనుభారం పడుతోంది. సీమాంధ్రలోని ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖలోని గెజిటెడ్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్లు మూడు కలిసి బుధవారం విజయవాడలో సీమాంధ్ర జెఎసిగా ఏర్పడ్డాయ.

మరోవైపు గురువారం విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. ఫైలిన్ తుఫాను, ముఖ్యమంత్రి హామీ నేపథ్యంలో వారు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రానికి 30 కంపెనీల సాయుధ బలగాలను తరలించారు. ఇప్పటికే 45 కంపెనీల బలగాలు ఉన్నాయి.

అనంత 1

అనంత 1

సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లాలో సబ్ కలెక్టర్ మరియు సబ్ డివిజనల్ మెడిస్ట్రేట్ వారి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సమైక్యవాదులు.

విజయనగరం 1

విజయనగరం 1

విజయనగరం జిల్లాలో గత వారం రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. విజయనగరంలో పోలీసుల కవాతు దృశ్యం.

విజయనగరం 2

విజయనగరం 2

విజయనగరంలో ఐదు రోజులుగా కర్ఫ్యూ విధించడంతో రహదారులు అన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్న దృశ్యం. రోడ్డుపై వెళ్తున్న ఓ పోలీసు.

విశాఖ 1

విశాఖ 1

విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో సీమాంధ్రలో ప్రజలు విద్యుత్ కష్టాలతో అల్లాడుతున్నారు. ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ చీకట్లో రిజిస్టర్ చూస్తున్న దృశ్యం.

విశాఖ 2

విశాఖ 2

విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో సీమాంధ్రలో ప్రజలు విద్యుత్ కష్టాలతో అల్లాడుతున్నారు. ఓ మంగళి దుకాణంలో చార్జింగ్ లైట్ వెలుగులో గడ్డం గీస్తున్న దృశ్యం.

విశాఖ 3

విశాఖ 3

విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో సీమాంధ్రలో ప్రజలు విద్యుత్ కష్టాలతో అల్లాడుతున్నారు. ఓ దుకాణంలో గ్యాస్ లాంతరు వెలుగులో...

విశాఖ 4

విశాఖ 4

విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో సీమాంధ్రలో ప్రజలు విద్యుత్ కష్టాలతో అల్లాడుతున్నారు. ఓ మహిళా ఉద్యోగి చీకట్లో కాలిక్యులేటర్ కొడుతూ...

English summary
Curfew in Vizianagaram town was eased for an hour on Tuesday morning after normalcy began to return in the violence-hit area even as strict vigil was being maintained during the relaxation period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X