దాడి తీవ్ర వ్యాఖ్య: తోడుగా.. విజయమ్మపై జగన్ వివరణ
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లిని విశాఖలో గెలిపించేందుకు కృషి చేయలేదన్న దాడి వీరభద్ర రావు వ్యాఖ్యల పైన వైయస్ జగన్ గురువారం స్పందించారు. తల్లిని, చెల్లిని కూడా నమ్మలేనివాడు.. ఇక ప్రజలను ఏం నమ్ముతాడని, ఎలా పాలిస్తాడని దాడి ఘాటైన విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో జగన్ ఆయన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. తన తండ్రి మరణానంతరం తనకు తోడుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే అమ్మను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని జగన్ చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉంటుందన్న ఆలోచనతోనే అమ్మను విశాఖ స్థానం నుంచి నిలబెట్టినట్లు చెప్పారు.

తన అమ్మ విశాఖ నుండి పోటీ చేస్తే ఉత్తరాంధ్రకు భరోసా ఉంటుందని తాను భావించానని చెప్పారు. స్థానిక కార్యకర్తలు, నేతలపై నమ్మకంతోనే ఈ పని చేశానని చెప్పారు. విశాఖ లోకసభ ఎన్నికల సమయంలో కడప నుండి ఒక్క సామాన్య కార్యకర్త కూడా విశాఖకు రాలేదని చెప్పారు.
ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశంలో భాగంగా జగన్ గురువారం విశాఖలో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఎన్నికల ఫలితాల పైన విజయవాడలో సమీక్ష నిర్వహించనున్నారు. కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాలులో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications