గొప్ప నాయకుడౌతాడు, నా ఆశీస్సులు: దాసరిని కల్సిన జగన్, పార్టీలోకి ఆహ్వానం!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు దర్శకరత్న దాసరి నారాయణ రావును కలిశారు. హైదరాబాదులోని దాసరి నివాసంలో జగన్ను అతనిని కలిశారు.
అనంతరం దాసరి విలేకరులతో మాట్లాడారు. తనకు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.కాగా, దాసరిని జగన్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోందంటున్నారు.

జగన్ ప్రజా సమస్యల పైన పోరాడుతూ మంచి నాయకుడిగా ఎదుగుతున్నాడని, గొప్ప నాయకుడౌతాడని కితాబిచ్చారు. అతను ప్రజలలో మంచి నాయకుడిగా గుర్తింపు సంపాదించుకుంటున్నారన్నారు.
ప్రజల సమస్యల పైన పోరాటాలు చేస్తున్నారన్నారు. తమ కలయిక కేవలం మర్యాదపూర్వకమేనని చెప్పారు. జగన్ మరింత బాగా ఎదగాలని తాను ఆశీర్వదించానని, తన దీవెనలు ఎప్పుడూ జగన్కు ఉంటాయని దాసరి ఈ సందర్భంగా చెప్పారు. దాసరిని జగన్ కలిసినప్పుడు అతని వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications