జనసేనలో చేరికపై తేల్చేసిన దాడిశెట్టి రాజా..!!
ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఇటు లడ్డు వివాదం కొనసాగుతున్న వేళ.. అటు వైసీపీ ముఖ్య నేతలు పార్టీ మారుతున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జనసేన లో చేరుతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజా తన పార్టీ మార్పు పైన తేల్చి చెప్పారు.
వైసిపి లోని మాజీ మంత్రులు, గోదావరి జిల్లా కాపు నేతలు జనసేనలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ జాబితాలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేరు కూడా ఉంది. అయితే తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాజా ఖండించారు. తాను జనశంలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మద్దని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్య రీచా హైదరాబాదులో ఉండాలని త్వరలోనే అందర్నీ కలుస్తానని ప్రకటించారు.

ఈ మేరకు తుని నియోజకవర్గ పార్టీ నేతలకు సోషల్ మీడియా ద్వారా తన సమాచారం పంపించారు. తాను తునిలో లేని సమయంలో జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని రాజా వివరించారు. తొలి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తనకు సహకరించిన నియోజకవర్గ కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పారు. జగన్ హోసన్న తన కార్యకర్తలను వీడి తాను వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. ఎవరు ఇలాంటి ప్రచారం చేసిన నమ్మవద్దని.. అనారోగ్యం కారణంగానే చికిత్స కోసం హైదరాబాదులో ఉన్నానని వెల్లడించారు.
తుని వచ్చిన వెంటనే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రాజా స్పష్టం చేశారు. రాజా తో పాటుగా ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు జనసేన చేరుతారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే త్రిమూర్తులు దీనిపైన స్పష్టత ఇవ్వగా ఇప్పుడు రాజా తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు తేల్చి చెప్పారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications