మండలి చైర్మన్ షరీఫ్ కామెంట్స్: వికేంద్రీకరణ బిల్లు ప్రాసెస్లో ఉంది, సెలక్ట్ కమిటీకి అందుకే..
వికేంద్రీకరణ బిల్లు పూర్తికాలేదని, ప్రాసెస్లో ఉన్నందునే సెలక్ట్ కమిటీకి పంపించానని మండలి చైర్మన్ షరీఫ్ స్పష్టంచేశారు. వికేంద్రీకరణ బిల్లులో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సవరించాలని తాను శాసనసభకు సూచించానని తెలిపారు. బిల్లులో తప్పులు ఉన్నందుకే సెలక్ట్ కమిటీకి సిఫారసు చేసినట్టు షరీఫ్ క్లారిటీ ఇచ్చారు.

ఆమోదం పొందాలంటే..
వికేంద్రీకరణ బిల్లులో ఉన్న తప్పుల ప్రక్రియ పూర్తయితే తప్ప ఆమోదం పొందని పరిస్థితి నెలకొంది. అందుకోసమే తన విచక్షణాధికారం ఉపయోగించానని షరీఫ్ చెప్పారు. రూల్ 154 కింద సెలక్ట్ కమిటీకి పంపించాననిపేర్కొన్నారు. బిల్లులో ల్యూప్ హోల్స్ ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని షరీఫ్ పేర్కొన్నారు. పొరపాట్లు జరిగాయని టీడీపీ సభ్యులు చెప్పడంతో తాను స్పందించానని పేర్కొన్నారు.

సరిదిద్దేందుకు...
బిల్లులో తప్పుల గురించి ప్రతిపక్ష సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని షరీఫ్ గుర్తుచేశారు. బిల్లును పరిశీలించి.. సరిదిద్దే ప్రయత్నం చేశానని చెప్పారు. బిల్లు రూపొందించే సమయంలో ఓవర్ లుక్లో తప్పులు జరగడం సహజమని.. కానీ వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత చట్టసభల్లో ఉందని మండలి చైర్మన్ షరీఫ్ గుర్తుచేశారు.

సరికాదు..
వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల వాదనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తప్పులు ఉన్నాయని సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నామని మండలి చైర్మన్ చెప్పగా.. విపక్ష టీడీపీ సభ్యులు స్వాగతించారు. అయితే బిల్లును డివిజన్ పద్దతిలో ఓటింగ్ కూడా నిర్వహించలేదు, సభలో ప్రవేశపెట్టిన తర్వాత మండలి చైర్మన్ విచక్షణాధికారం పేరుతో సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.

తీర్మానం ఏదీ..?
దీనిని ఏపీ ప్రభుత్వం ఖండిస్తోంది. మండలికి వచ్చిన బిల్లుపై చర్చ జరగాలే తప్ప.. సెలక్ట్ కమిటీకి పంపించడం వీలుకాదని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ సెలక్ట్ కమిటీకి పంపించాలన్న శాసనసభలో తీర్మానం చేయాలని గుర్తుచేస్తుంది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications